PPM: ఈనెల 23న శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా,ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. వేడుకలకు జిల్లాస్థాయి అధికారులు, పాల్గొంటారని చెప్పారు.