NDL: సంజామల మండల పరిధిలోని ముదిగేడులో రూ.20 లక్షల నిధులతో బుధవారం నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో టీడీపీ నేత రాజగోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీదేవి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఎస్సీ కాలనీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నూతన రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు.