PLD: వెల్దుర్తి మండలంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అర్జీలు స్వీకరించారు. సంబంధిత సమస్యలపై అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.