PLD: అమరావతి(M) ఎండ్రాయిలో పిడుగుపాటుకు ఓ పాడి రైతు బలయ్యాడు. గ్రామానికి చెందిన విజయ్ కుమార్ శనివారం సాయంత్రం గేదెలను మేపేందుకు పొలానికి వెళ్లగా, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా.. గట్టుపై పిడుగు పడి విజయ్ మృతి చెంది ఉండటం గమనించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.