AKP: దొండపూడి చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రెండు బ్యాగులతో గంజాయి తరలిస్తున్న ఇద్దరు అనుమానితులు కనిపించారు. పోలీసులను చూసి బ్యాగులు వదిలి పారిపోవడంతో శనివారం ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాగుల్లో 22 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. నిందితులు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందినవారని పోలీసులు తెలిపారు.