SS: మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ధర్మవరం మున్సిపాలిటీలో జరుగుతున్న మాస్టర్ తనిఖీలో నియోజకవర్గ ఇంఛార్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు. కొత్తపేట అండర్ బ్రిడ్జి వద్ద కాలువల పూడికతీత పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.