ఏలూరులో దేవ తెలకుల రాష్ట్ర సంఘం కార్యదర్శి కాశిన సత్యనారాయణ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. మండపేట (M) ద్వారపూడిలో జరిగిన పరువు హత్యలో తమ సామాజిక వర్గానికి చెందిన సూర్యప్రకాష్ అన్యాయంగా బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.