PPM: జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని, జిల్లాలో గ్యాస్ కొరత లేదని జిల్లా జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నట్లు చెప్పారు. గ్యాస్ దొరకదనే కంగారు వద్దు అన్నారు.