GNTR: కొల్లిపర మండలం అత్తోట సమీపంలోని కుంచవరం అడ్డరోడ్డు వద్ద గల పంట పొలాల్లో గుర్తుతెలియని మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. మృతదేహం కుళ్ళిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడు ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు.