NDL: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో నిర్వాహకులు మెనూ తప్పనిసరిగా పాటించాలని మండల విద్యాధికారి న్యామతుల్లా పేర్కొన్నారు. మంగళవారం చాగలమర్రిలోని గుంతపాలెం వీధిలో గల ప్రాథమిక పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన తనిఖీ చేశారు. భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో నాణ్యతను అడిగి తెలుసుకున్నారు.