తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు నెల్లబల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన పుదూరుకు చేరుకుని టిడ్కో ఇళ్లను ప్రారంభిస్తారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేస్తారు. మధ్యాహ్నం బిరదవాడ వద్ద టీడీపీ నాయకులతో సమావేశం అవుతారని అధికారులు వెల్లడించారు.