ఏలూరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి నిన్న శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏలూరు పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.