GNTR: అమరావతిలో 49వ జాతీయ గుడారాల పండుగ వేడుకలు గురువారం సాయంకాలం నుంచి ప్రారంభమవుతాయని పాస్టర్ అనిల్ కుమార్ తెలిపారు. భక్తుల అవసరార్థం తాటాకు పందిళ్లు, టెంటులు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు ప్రత్యేక రైలు నడుపుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ ఉచితంగా రాత్రి 11 గంటల వరకు బస్సు సౌకర్యం కల్పించారన్నారు.