కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర నగరంలో మార్నింగ్ విజిట్ నిర్వహించి ప్రధాన రహదారుల పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక బృందాలతో కలిసి శుభ్రత పనులను పర్యవేక్షించారు. క్లాప్ వాహనాల ద్వారా చెత్త సేకరణ విధానాన్ని తనిఖీ చేసి, సమయానికి చెత్త తరలించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.