కోనసీమ: బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులుగా అయినవిల్లి మండలంకు చెందిన సీనియర్ నాయకులు విళ్ల దొరబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మంగళవారం అయినవిల్లి లంకలో ఆయన గెస్ట్ హౌస్ వద్ద బీజేపీ మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, ఏఎంసీ డైరెక్టర్ కుడుపూడి సత్యవతి చంద్రశేఖర్ శాలువాతో ఘనంగా సత్కరించారు.