అన్నమయ్య: జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా కంచాలమ్మ గండి చెరువును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. మాండవ్య నది శుభ్రత, చెక్డ్యాముల నిర్మాణం, సప్లై ఛానల్ మరమ్మతులతో నీటి నిల్వ పెంచాలని మంత్రి సూచించారు. సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.