CTR: యాదమరి మండలం వరిగపల్లె జంక్షన్ వద్ద సోమవారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా అక్రమ పొగాకు పట్టుబడింది. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తున్న టాటా ఇంట్రా వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అయితే సుమారు రూ.8.99 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులు లభ్యమైంది. డ్రైవర్ నదీమ్ పాషాను ప్రశ్నించగా సరుకు రవాణాకు సంబంధించిన బిల్లులు లేవని పోలీసులు తెలిపారు.