నెల్లూరులో మూలపేట మూలస్థానేశ్వర స్వామి ఆలయ హుండీల కానుకలను గురువారం లెక్కించారు. 104 రోజులకు స్వామి, అమ్మవార్ల హుండీల ద్వారా రూ. 8,94,815 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఛైర్మన్ భ్రాజకుమార్, ఈవో వెంకట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించి, ఆలయ ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.