KNR: హుజురాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం ఉత్సాహభరితంగా జరిగాయి. అధ్యక్షుడిగా కేసరి శేషయ్య 63 ఓట్లతో తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించగా, ప్రధాన కార్యదర్శిగా పాక జ్యోత్స్న దేవి 85 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇతర పదవులకు రాజేష్ పిట్టాల, లింగమూర్తి, మోరే కళ్యాణ్, యాస్మిన్ ఎన్నిక కాగా, నూతన కార్యవర్గాన్ని అభినందించారు.