KRNL: కౌతాళం మండలం ఉరుకుందలోని శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు గురువారం జరిగింది. ఈవో వాణి ఆధ్వర్యంలో స్వామివారి హుండీ ఆదాయం రూ.1,09,91,864 నమోదైంది. అన్నదాన హుండీకి రూ.10,71,889 లభించింది. భక్తులు 18.2 గ్రాముల బంగారం, 11.4 కేజీల వెండిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కమలాకర్, అర్చకులు పాల్గొన్నారు.