VKB: వికారాబాద్ 30వ వార్డులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఛైర్పర్సన్ గడ్డం అనన్య పాల్గొని చెత్తను వేర్వేరు డబ్బాల్లో వేసి సేకరణ వాహనాలకు ఇవ్వాలని సూచించారు. వార్డు సమస్యలను పరిశీలించి త్వరిత పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ఛైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్ విజయలక్ష్మీ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.