NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రెండవ రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ధ్వజపటం ఎగరవేసి సకల దేవతలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సంతోష్ రెడ్డి సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.