WGL: నగరంలో ఒక రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ను సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ పెట్టుబడి పేరుతో మోసం చేసి రూ.కోటి డబ్బు దోచుకున్నారు. నకిలీ వెబ్సైట్ ద్వారా పరిచయం చేసుకుని, విడతల వారీగా డబ్బు జమ చేయించిన మోసగాళ్లు, చివరకు ఆదాయపన్ను పేరుతో అదనంగా డబ్బు అడగడంతో బాధితుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.