KRNL: దేవనకొండ మండలం కొత్తపేట గ్రామంలో బుధవారం నంద కిషోర్ (9) అనే బాలుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో, బాలుడు ఒంటరిగా పొలం వద్ద ఉన్న విద్యుత్ నియంత్రిక కట్టపైకి ఎక్కడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం అందించగా, ఆసుపత్రికి తరలించినా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.