కడప: నగరంలోని 12వ డివిజన్ కార్పొరేటర్ సానపు రెడ్డి శివకోటి రెడ్డి సోమవారం రాత్రి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతున్నారు. దీంతో వైసీపీ అక్కడ డైలమాలో పడింది.