ASR: గంజాయి సాగు, రవాణా చేయడం చట్టరీత్యా పెద్ద నేరమని పాడేరు డీఎస్పీ షైక్ షహబాజ్ అహ్మద్ అన్నారు. మంగళవారం డుంబ్రిగూడ మండలంలో పర్యటించారు. ఇందులో భాగంగా ఎస్సై పాపినాయుడుతో కలిసి కోసంగి గ్రామంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు.