SS: జిల్లా కలెక్టరేట్లో 20 సూత్రాల కమిటీ రాష్ట్ర ఛైర్మన్ లంకా దినకర్ జిల్లా అధికారులతో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో భాగంగా విద్య, వైద్య రంగాల్లో జిల్లా ప్రగతి సాధించాలని అధికారులను ఆదేశించారు. పెనుకొండ మెడికల్ కాలేజీ పనులు వేగవంతం చేయాలని సూచించారు.