PLD: చిలకలూరిపేట మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ప్రారంభించారు. ప్రభుత్వం శనగ రైతులకు క్వింటాల్కు రూ. 5,875 మద్దతు ధర కల్పిస్తోందని తెలిపారు. గతంలో పొగాకు, మిర్చి రైతులకు అండగా నిలిచినట్లే, శనగ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.