మార్కాపురం మార్కెట్ యార్డ్ను జేసీ పి. శ్రీనివాసులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కందులు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, సేకరణ విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తూకంలో తేడాలు రాకుండా చూసి రైతులకు తగిన న్యాయం చేయాలని, ధరల విషయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.