E.G: తాళ్లపూడి మండలంలో బోట్స్ మెన్ సొసైటీ ఇసుక ర్యాంపులను తహశీల్దార్ లక్ష్మీ లావణ్య బుధవారం తనిఖీ చేశారు. వర్క్ ఆర్డర్లను ఆమె పరిశీలించారు. ఇసుక వాహనాలకు ఖచ్చితంగా టార్పాలిన్ కట్టాలని, బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. రోడ్లపై పడే ఇసుకను ప్రతిరోజు శుభ్రం చేయాలని సూచిస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.