NTR: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నాయని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. బుధవారం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందన్నారు.