GNTR: పొన్నూరు మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు మంగళవారం కమిషనర్ రమేశ్ బాబు తెలిపారు. ఈ ప్రయోజనం పొందాలంటే అసలు పన్నుతో పాటు మిగిలిన సగం వడ్డీని మార్చి 31వ తేదీలోపు ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.