KDP: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. శనివారం కడపలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, తాగునీటి అవసరాలకు సరిపడా వనరులు ఉన్నాయని పేర్కొన్నారు.