అన్నమయ్య: కురబలకోట మండలం ముదివేడు జాతరలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెడ్డివారిపల్లిలోని సునీత-జగదీశ్ ఇంటికి జాతర నిమిత్తం వచ్చిన బంధువులు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో పుంగనూరు మండలం చదళ్ల గొల్లపల్లికి చెందిన పద్మావతి (50), చిత్తూరు కొంగారెడ్డిపల్లికి చెందిన వెంకటేష్ (40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో బాలిక తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.