KRNL: పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామానికి చెందిన రైతులకు పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సమకూరిన లబ్ధిపై రైతులకు మంగళవారం టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, సొసైటీ ఛైర్మన్ నరసప్ప, సీఈవో నరసింహామూర్తి, టీడీపీ గ్రామ అధ్యక్షులు నరసింహులు అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 20 వేలు ఇచ్చిందన్నారు.