TPT :మహోన్నత వ్యక్తుల ఆశయాలు, ఆలోచనలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళల విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు.