W.G: వీరవాసరం (మం) తోలేరు గ్రామంలోని రైతు సేవ కేంద్రం వద్ద బుధవారం గ్రామ సభ, పునఃసర్వేలో కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా రాజముద్ర పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతన్నలకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పులను సరిదిద్ది భూ వివాదాలు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ కర్తవ్యమని చెప్పుకొచ్చారు.