GNTR: అమరావతి విస్తరణపై వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మొదటి 50 వేల ఎకరాలకు ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చవుతుందని చెప్పి ఇప్పుడు మరో 50 వేల ఎకరాలను అదనంగా ఎందుకు చేరుస్తున్నారని ప్రశ్నించారు. ఈ విస్తరణ వల్ల మొత్తం లక్ష ఎకరాల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కోసమే దాదాపు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇంత భారీ వ్యయం అవసరమా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.