పల్నాడు: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సత్తనపల్లి మండలం తొండపిలో భార్యాభర్తల మధ్య వివాదం కలకలం రేపింది. భార్య భూలక్ష్మిపై అనుమానం పెంచుకున్న భర్త లక్ష్మయ్య అమానుషానికి తెగబడ్డాడు. క్షణికావేశంలో కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఆమె కాలును నరికేశాడు. ఈ దారుణ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.