ATP: కనగానపల్లి మండలం నెమళివరం, పాతపాళ్యం గ్రామాల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదివారం పర్యటించారు. గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్లను పరిశీలించి, కొత్త రోడ్డు మార్గాల అవసరాలపై గ్రామస్థులు, టీడీపీ నాయకులతో చర్చించారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లతో సమావేశమై మీ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆమె హామీ ఇచ్చారు.