కడప జిల్లాలో మాంసం ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ కిలో ధర రూ. 210 నుంచి రూ. 240 వరకు ఉండగా, మటన్ ధర కిలోకు రూ. 850గా కొనసాగుతోంది. చేపల ధరలు కిలోకు రూ. 100 నుంచి రూ. 300 వరకు ఉన్నాయి. ఆదివారం కావడంతో చికెన్ దుకాణాల వద్ద కొనుగోలుదారులు భారీగా తరలివచ్చారు. ధరలు పెరిగినా వినియోగదారుల రద్దీ మాత్రం తగ్గలేదు.