AKP: పాయకరావుపేట నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద 39,302 మంది లబ్ధి పొందినట్లు వ్యవసాయ శాఖ ఏడీ ఉమా ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కోటవురట్లలో జరిగిన కార్యక్రమంలో రైతులకు చెక్కు అందజేశారు. మూడవ విడతలో రూ.21.67 కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసినట్లు తెలిపారు. ఇందులో టీడీపీ నాయకులు లాలం కాశీనాయుడు, కొప్పిశెట్టి వెంకటేష్ పాల్గొన్నారు.