E.G: నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులపై చర్చించి వాటిని ఆమోదింప చేసుకునే దిశగా కృషి చేస్తారని వెల్లడించారు.