NTR: వీరులపాడులోని సన్రైస్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని రెవిన్యూ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవికుమార్ మాట్లాడుతూ.. గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టించి సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల పరిధిలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని తెలిపారు.