KRNL: హలహర్వి KGBVలో ఆరవ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ పద్మ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద కుటుంబాల విద్యార్థినులు ఈ అవకాశానికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.