KRNL: గ్రామ అభివృద్ధి కోసం ఇంటి, కుళాయి, వాణిజ్య పన్నులను సకాలంలో చెల్లించాలని దేవనకొండ గ్రామ కార్యదర్శి రాముడు యాదవ్ ఇవాళ కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు పన్నుల వసూలు కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఆలస్యం చేయకుండా బకాయిలు వెంటనే చెల్లించి గ్రామ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.