NLR: సిటీలోని బలిజపాలెంలో రూ. 40 లక్షల వ్యయంతో ఆధునిక హంగులతో సిద్ధమైన పార్క్ను మంత్రి నారాయణ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఏసీ మినీ ఫంక్షన్ హాల్ను ప్రారంభించారు. అనంతరం ఒక చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్కులో జిమ్ చేసి, చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేస్తూ వారితో సరదాగా గడిపారు.