ATP: వైసీపీ అధినేత జగన్కు పేర్లు, ఫోటోల పిచ్చి ఇంకా తగ్గలేదని MLA దగ్గుపాటి ప్రసాద్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అమరావతికి చట్టబద్ధత రావడంపై జగన్ ఏమాత్రం ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. గతంలో మూడు ముక్కలాట ఆడి 11 సీట్లకు పరిమితమయ్యారని, ఇప్పుడు పిచ్చి తుగ్లక్ తరహాలో ‘మావిగన్’ అంటూ అంటూ వింత ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.