ATP: పామిడి మండలం కండ్లపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించే రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ షర్మిల ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకూ గ్రామ సర్వే నెంబర్స్ 2, 14, 15, 16, 17 లోని సబ్ డివిజన్ భూములకు రీసర్వే ఉంటుందన్నారు. రైతులు అధికారులకు అందుబాటులో ఉండి సహకరించాలని ఆమె కోరారు.