GNTR: సీఎం చంద్రబాబు గురువారం అధికారిక కార్యక్రమాలతో నిమగ్నం కానున్నారు. ఉదయం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 10:50కి సచివాలయానికి చేరుకుంటారు. 11:45కు ఆర్థిక వ్యవహారాలపై సమీక్ష, సాయంత్రం 4 గంటలకు దేవాదాయ శాఖపై సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 5:30కి నివాసానికి చేరుకుంటారని టీడీపీ నేతలు తెలిపారు.